Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి మనీ ఇవ్వలేదని భార్యలను చంపేశారు.. ఎవరో తెలుసా?

ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:01 IST)
ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... పాలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిక్రియా హుస్హరీ ప్రాంతంలో నారద్ మాంఝీ, అఖిలేష్ మాంఝీ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉన్నారు. వీరిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో మద్యానికి బానిసలైన వీరిద్దరూ డబ్బుకోసం తమ భార్యలను వేధించేవారు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యలను ఒత్తిడి చేయగా, వారు తమ వద్ద లేదని చెప్పారు. 
 
అంతే.. ఆగ్రహించిన వీరిద్దరూ ఇళ్లకు వచ్చి తమ భార్యల గొంతు నొక్కి హత్య చేశారు. ఒక మృతదేహాన్ని బావిలో పారేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టి ఆ ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments