Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు.. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (09:15 IST)
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో ఇవి కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత సరిహద్దు గస్తీ దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరిపాయి. ఓ డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని 96 రౌండ్ల కాల్పులు జరిపినట్టు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో తోకముడిచిన పాక్ డ్రోన్లు తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోయారు. 
 
కొద్దిసేపు కలకలం రేపిన ఈ రెండు డ్రోన్లలో తొలి డ్రోన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన గురుదాస్ పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు దానిపై కాల్పులు ప్రారంభించడంతో వెళ్లిపోయాయి. 
 
ఆ డ్రోన్ లక్ష్యంగా చేసుకుని ఏకంగా 96 రౌండ్ల కాల్పులు జరిపింది. 5 ఇల్యుమినేషన్ బాంబులను కూడా ప్రయోగించారు. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో నిశితంగా తనిఖీ చేశారు. 
 
అదేవేధంగా అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో కూడా మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో ఈ డ్రోన్ కూడా తమ భూభాగంలోకి వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments