Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు.. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (09:15 IST)
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో ఇవి కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత సరిహద్దు గస్తీ దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరిపాయి. ఓ డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని 96 రౌండ్ల కాల్పులు జరిపినట్టు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో తోకముడిచిన పాక్ డ్రోన్లు తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోయారు. 
 
కొద్దిసేపు కలకలం రేపిన ఈ రెండు డ్రోన్లలో తొలి డ్రోన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన గురుదాస్ పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు దానిపై కాల్పులు ప్రారంభించడంతో వెళ్లిపోయాయి. 
 
ఆ డ్రోన్ లక్ష్యంగా చేసుకుని ఏకంగా 96 రౌండ్ల కాల్పులు జరిపింది. 5 ఇల్యుమినేషన్ బాంబులను కూడా ప్రయోగించారు. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో నిశితంగా తనిఖీ చేశారు. 
 
అదేవేధంగా అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో కూడా మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో ఈ డ్రోన్ కూడా తమ భూభాగంలోకి వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments