Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాలయంతో పాటు సీఎం ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం...

ఠాగూర్
గురువారం, 4 జనవరి 2024 (13:08 IST)
అయోధ్యలో కొత్తగా నిర్మించి రామాలయంతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో అయోధ్యతో పాటు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య రామాలయానికి మరికొన్ని రోజుల్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడం ఇపుడు కలకలం రేపుతున్నాయి. 
 
మరోవైపు, ఈ బెదిరింపులపై అప్రమత్తమైన పోలీసులు.. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులిద్దరూ పేలుళ్లకు పాల్పడతామని సోషల్‌మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సీఎంతో పాటు ఎస్‌టీఎఫ్‌ చీఫ్‌ అమితాబ్‌ యశ్‌ను కూడా హత్య చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టు ఆధారంగా నిందితులకు సంబంధించిన మెయిల్‌ అడ్రస్‌లను కనుగొన్నారు. 
 
వీటిపై సాంకేతిక విశ్లేషణ అనంతరం నిందితులను ఓం ప్రకాశ్‌, తాహర్ సింగ్‌లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని తెలిపారు. తాహర్‌ సింగ్‌ మొయిల్స్‌ను సృష్టించగా.. ప్రకాశ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments