Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేద నిలయం నుంచి మన్నార్గుడి మాఫియాను గెంటివేస్తాం : ఓ.పన్నీర్ సెల్వం

తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని శశికళ... ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదని ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఉన

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (10:29 IST)
తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని శశికళ... ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదని ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఉన్నారు. అదేసమయంలో శశికళ సీఎం కాకుండా అడ్డుకునేందుకు పన్నీర్‌కు అండగా ఉండేందుకు 89 మంది ఎమ్మెల్యేలున్న విపక్ష నేత ఎంకేస్టాలిన్ అండంగా ఉండటంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో, తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రి విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. దీంతో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు, మొన్నటి దాకా సైలెంట్‌గా ఉన్న పన్నీర్ సెల్వం... ఇప్పుడు తూటాల్లాంటి మాటలతో శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయంను స్మారక మందిరంగా చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ తిష్టవేసివున్న శశికళతో పాటు.. మన్నార్గుడి మాఫియాను వేద నిలయం నుంచి గెంటివేస్తామని ప్రకటించారు. అలాగే, తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, చెన్నైకు గవర్నర్ రాగానే ఆయనను కలిసి తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకటించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments