Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలా.. భారత్‌లో శక్తివంతమైన భూకంపం.. శాస్త్రవేత్త హెచ్చరిక

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (19:06 IST)
టర్కీ భూకంపం నేపథ్యంలో.. భారత్‌లో ఇలాంటి శక్తివంతమైన భూకంపం ఏర్పడే అవకాశం వుందని.. హైదరాబాద్‌లోని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. భూమి ఉపరితలం నిరంతరం కదలికలో ఉండే వివిధ పలకలను కలిగి ఉంటుంది. భారత ఫలకం సంవత్సరానికి 5 సెం.మీ కదులుతోంది. 
 
ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడి పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా శక్తివంతమైన భూకంపం ఏర్పడే అవకాశం వుందని తెలిపారు. హిమాలయ ప్రాంతం అధిక భూకంపాల ముప్పు జోన్‌లో వుంది. 
 
గతంలో 1720లో కుమావన్ భూకంపం 1803లో గర్వాల్ భూకంపం వంటి భారీ విపత్తులు సంభవించాయి. కానీ గత వందేళ్ల కాలంలో 9 లేకుంటే అంత కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించిన దాఖలాలు లేవు. 1991లో ఉత్తరకాశీ, 1999 చమోలీ భూకంపాలు కూడా తక్కువ తీవ్రతతో కూడుకున్నవే. 
 
ఈ ప్రాంతం నిరంతరం ఒత్తిడికి గురవుతోందని.. భూకంపం ద్వారా మాత్రమే అది విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది భూకంపాలకు దారి తీస్తుందని చెప్పారు. 
 
అయితే, ఈ భూకంపం తేదీ, సమయాన్ని అంచనా వేయలేమని, విధ్వంసం ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారే బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుందని పూర్ణచంద్రరావు వెల్లడించారు
 
బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ముఖద్వారంగా భావించే జోషిమఠ్‌లో ఇటీవల భూమి క్షీణించిన నేపథ్యంలో పూర్ణచంద్రరావు వ్యాఖ్యలకు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments