Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల

Webdunia
గురువారం, 6 జులై 2017 (10:31 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న మీరా కుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు పలికారు. దీన్ని త్రిపుర రాష్ట్రానికి చెందిన ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వీరంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
సీపీఎం మద్దతు తెలిపిన మీరాకుమార్‌కు ఓటేయడానికి వారు నిరాకరిస్తున్నారు. త్వరలోనే వారు బీజేపీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. శుక్రవారం ఆ ఆరుగురు అస్సోంలోని గౌహ‌తిలో జరిగే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ సభలో పాల్గొన‌నున్నారు. వీరంతా గతేడాది కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఎంసీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ల‌డానికి సిద్ధమవుతున్నారు.    
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments