Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపేశాడు.. ఆపై గొంతు కోసుకున్నాడు..

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:59 IST)
త్రిపురలో ఓ యువకుడు కిరాతకుడిగా మారాడు. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హతమార్చాడు. అదే కత్తితో గొంతుకోసుకున్నాడు. ఉత్తర త్రిపుర జిల్లాలోని కంచన్‌పూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న హత్యకు గురైన బాలికతో కార్తీక్ దేబ్‌నాథ్ అనే యువకుడికి ప్రేమ వ్యవహారం ఉందని పోలీసు అధికారి తెలిపారు.
 
బాలిక ఒంటరిగా తన పాఠశాలకు వెళుతున్నప్పుడు, దేబ్‌నాథ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో బాలుడు గొంతు కోసుకున్నాడు. ఆపై స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక మార్గమధ్యంలోనే మృతి చెందింది. 
 
తీవ్రంగా గాయపడిన కళాశాల విద్యార్థి దేబ్‌నాథ్‌ను ధర్మనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments