Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి..

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (14:20 IST)
డైలీ వేజ్, కాంట్రాక్చువల్, ఔట్‌సోర్స్‌డ్ విధానాల్లో నియమితులైన అన్ని తరగతుల మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో వేతనాలతో కూడిన సెలవులను మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. రుతుస్రావం సమయంలో వేతనాలతో కూడిన సెలవులను, ఇతర సదుపాయాలను మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. 
 
ఈ పిటిషన్‌ను వినతి పత్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇతర వ్యవస్థలను కోరింది. దీనిపై నిర్ణీత కాలంలో స్పందించాలని ఆదేశించింది. సరైన స్పందన రాని పక్షంలో తగిన వ్యవస్థను ఆశ్రయించవచ్చునని పిటిషనర్లకు తెలిపింది.
 
ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను వినతి పత్రంగా పరిగణించాలని, దీనిలో పేర్కొన్న అంశాలపై చట్టాలు, ప్రభుత్వ విధానాలకు లోబడి నిర్ణీత కాలంలో స్పందించాలని ఆదేశించింది.
 
ఢిల్లీ లేబర్ యూనియన్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేసింది. మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సమయంలో ప్రత్యేక కాజువల్ లీవ్స్ లేదా పెయిడ్ లీవ్స్ మంజూరు చేయాలని కోరింది. ప్రత్యేక, పరిశుభ్రమైన మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలని ఆదేశించాలని కోరింది. నియమిత కాలం అనంతరం విశ్రాంతి పొందేందుకు అవకాశం కల్పించాలని, ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ అందజేయాలని ఆదేశించాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments