Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ గోరఖ్‌పూర్‌లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీ: 9 మంది మృతి

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (09:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో గత అర్థరాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బోగిల మధ్య మరింత ప్రయాణికులు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. 
 
క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలు సిగ్నాల్ దాటి వెళ్లి అదే ట్రాక్పై వస్తున్న బరౌనీ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టిందని వారు తెలిపారు. దీంతో బరౌనీ ఎక్స్ప్రెస్కు చెందిన 5 జనరల్ బోగీలు పట్టాలు తప్పగా... క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైలులోని పలు కోచ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కాగా క్రిషాక్ ఎక్స్ప్రెస్ రైల్ డ్రైవర్లు ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా గోరఖ్పూర్ మార్గంలో పలురైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను మాత్రం మరో మార్గంలో మళ్లిస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments