జలుబు చేసిందని ఆవిరి పట్టింది.. చనిపోయింది.. ఎలా..?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:49 IST)
జలుబు చేసిందని ఆవిరి పట్టిన నర్సింగ్ విద్యార్థిని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడి, ఆత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆత్తూరు, పూమంగళంకు చెందిన మోది నాయకం ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఈయన భార్య ఓ టీచర్. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. చిన్నకూతురు కౌసల్య (18) నర్సింగ్ చదువుతోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈమెకు జలుబు చేసింది. ఇందుకోసం ఆమె ట్యాబ్లెట్లు వాడింది. పనిలో పనిగా ఆవిరిపట్టింది. ఇందుకోసం పెద్ద పాత్రలో తైలం వేసి ఇంట్లోని దుప్పటి కప్పుకుని ఆవిరిపట్టడం చేసింది. 
 
అయితే బెడ్ షీట్ కప్పుకోవడంతో గాలి లేకపోవడంతో.. ఊపిరాడక పోవడంతో ఆ వేడినీటిలోనే పడిపోయింది. చాలా సేపటికి కౌసల్య బెడ్ షీట్ కప్పుకున్నట్లే వుండటంతో అనుమానంతో బెడ్ షీట్ తొలిగించి చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఊపిరాడక అపస్మారక స్థితిలో వున్న కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments