Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు చేసిందని ఆవిరి పట్టింది.. చనిపోయింది.. ఎలా..?

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:49 IST)
జలుబు చేసిందని ఆవిరి పట్టిన నర్సింగ్ విద్యార్థిని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడు, తూత్తుకుడి, ఆత్తూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆత్తూరు, పూమంగళంకు చెందిన మోది నాయకం ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఈయన భార్య ఓ టీచర్. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు. చిన్నకూతురు కౌసల్య (18) నర్సింగ్ చదువుతోంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈమెకు జలుబు చేసింది. ఇందుకోసం ఆమె ట్యాబ్లెట్లు వాడింది. పనిలో పనిగా ఆవిరిపట్టింది. ఇందుకోసం పెద్ద పాత్రలో తైలం వేసి ఇంట్లోని దుప్పటి కప్పుకుని ఆవిరిపట్టడం చేసింది. 
 
అయితే బెడ్ షీట్ కప్పుకోవడంతో గాలి లేకపోవడంతో.. ఊపిరాడక పోవడంతో ఆ వేడినీటిలోనే పడిపోయింది. చాలా సేపటికి కౌసల్య బెడ్ షీట్ కప్పుకున్నట్లే వుండటంతో అనుమానంతో బెడ్ షీట్ తొలిగించి చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. 
 
ఊపిరాడక అపస్మారక స్థితిలో వున్న కౌసల్యను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments