Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 టన్నుల టమాటాలతో వెళ్లిన లారీ మాయం.. గుండెలు బాదుకున్న..?

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (18:13 IST)
కొండెక్కిన టమాటా ధరలతో వాటిని పండించిన రైతులు.. కోటీశ్వరులు అవుతున్న ఘటనలు అనేకం. అయితే టమాటాల ధర భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు ఎక్కువైపోయాయి. తాజాగా టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాయం కావడంతో ఓ వ్యాపారి గుండెలు బాదుకుంటున్నాడు. రూ. 21 లక్షల విలువైన 11 టన్నుల టమాటాలతో వెళ్తున్న లారీ కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారికి ఏం చేయాలో తోచక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. 
 
కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నుంచి మునిరెడ్డి అనే ఓ వ్యాపారికి చెందిన టమాటాల లోడుతో వెళ్లిన లారీ మాయం అయ్యింది.  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీని మునిరెడ్డి అద్దెకు తీసుకున్నాడు. ఇందులో టమోటాలను పంపాడు. జీపీఎస్ ట్రాక్ కూడా అందుకు అమర్చాడు.
 
అయితే భోపాల్ టోల్ గేట్ వద్ద లారీ మాయమైంది. ఆపై లారీ డ్రైవర్ ఫోన్ కూడా స్వీచ్ఛాప్ కావడం ఆ రైతు గుండెలు బాదుకుంటున్నాడు. 15 కిలోల బరువున్న ఒక్కో బాక్సును రూ.2000 నుంచి రూ. 2150 ధర పెట్టి కొనుగోలు చేసినట్లు మునిరెడ్డి వివరించాడు. మొత్తం 11 టన్నులకు రూ. 21 లక్షలు చెల్లించానని వాపోయాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments