Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ఠాగూర్
సోమవారం, 14 ఏప్రియల్ 2025 (15:21 IST)
సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమికి తల్లడిల్లిపోతుంటారు. ఇక స్కూల్ విద్యార్థులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఢిల్లీలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు నెలకొంటాయి. ఎండవేడిమి, వడగాల్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు సతమతమవుతుంటారు. 
 
ఢిల్లీలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడివేసవిలో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఢిల్లీ యూనివర్శిటికీ చెందిన లక్ష్మీభాయి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష్ వత్సల చేసిన వినూత్న పనికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఆవుపేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు. ఇలా చేయడం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు. వేసవిలో గదులను కూల్‌గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవుపేడ పూశామని, మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments