Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళనిస్వామికి ఓటు వేస్తే మీ అంతు చూస్తాం.. ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే కార్యకర్తల వార్నింగ్

మరికొద్దిసేపట్లో త‌మిళ‌నాడు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె ప‌ళ‌నిస్వామి సర్కారు బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కోనుంది. దీంతో కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఆయ‌న‌ వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (10:31 IST)
మరికొద్దిసేపట్లో త‌మిళ‌నాడు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె ప‌ళ‌నిస్వామి సర్కారు బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కోనుంది. దీంతో కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఆయ‌న‌ వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. మొత్తం 35 వాహనాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారు బయలుదేరారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను మొత్తం మూడు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపు బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించారు. 
 
అయితే చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్కడ వారిని అడ్డుకున్న అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు కె.ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని నినాదాలు చేసి, గంద‌ర‌గోళం సృష్టించారు. వారిపై దాడికి య‌త్నించారు. కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో కొద్దిసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది. 
 
భ‌ద్ర‌త న‌డుమ స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను పోలీసులు తిరిగి అసెంబ్లీకి త‌ర‌లించారు. అసెంబ్లీ వద్ద ఇప్ప‌టికే భద్రతను పెంచారు. ఆ ప‌రిస‌రాల్లో మొత్తం 2 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక అదనపు బలగాలను సైతం సిద్ధంగా ఉంచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments