Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (12:47 IST)
దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే వుంది. తాజాగా దేశంలో రికార్డు స్థాయికి చేరాయి.  గడచిన 24 గంటల్లో 15,968 కరోనా కేసులు నమోదు కాగా, 465 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది.

వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు. 
 
కరోనా వైరస్ కారణంగా పశ్చిమబెంగాల్ లో ఓ ఎమ్మెల్యే మరణించారు. అంతకుముందే తమిళనాడులోనూ ఎమ్మెల్యే బలయ్యారు. జూన్ 23 వరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 73 లక్షల 52 వేల 911 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో తమోనష్ ఘోష్ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మూడుపార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీఎంసీ ఎమ్మెల్యే మృతికి సీఎంమమతా బెనర్జీ, పార్టీనేతలు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments