Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న పులి... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (09:29 IST)
ఓ పులి వరద నీటి ఉధృతిలో కొట్టుకుని పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజాపురి బ్యారేజీ వద్ద కనిపించింది. 
 
ఈ బ్యారేజీ నుంచి విడుదల చేసిన వరద నీటిలో చిక్కకున్న ఈ పులి వరద నీటి నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడింది. భారీ నీటి ప్రవాహాన్ని దాటేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి, చివరకు గిరిజాపురి బ్యారేజీ వరద నీటిలో దిగువ ప్రాంతానికి కొట్టుకునిపోయింది. 
 
ఈ ప్రాంతం దుద్వా టైగర్ రిజర్వ్‌లో భాగమైన కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉంది. అది బ్యారేజీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది కానీ భారీ ప్రవాహాలు బ్యారేజీ కిందికి కొట్టుకునిపోయింది. 
 
అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులు పులి సంచారాన్ని పరిశీలించి బ్యారేజీ గేట్లను మూసివేశారు. ఆరు గంటల శ్రమ తర్వాత పులి సురక్షితంగా రక్షించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments