Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డు సృష్టించనున్న యూపీ ఆర్టీసీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:09 IST)
బస్సులతో గిన్నీస్ రికార్డ్‌కు ప్రయత్నిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని ముగింపును మాత్రం మరింత ఆకట్టుకునే రీతిలో ఉండేలా ప్లాన్ చేసింది. 
 
పవిత్ర గంగానది వెంట దాదాపు 8 కిలోమీటర్ల పొడవునా 40 స్నాన ఘట్టాల్ని నిర్మించారు. భద్రత కోసం దాదాపు 20 వేల మంది సైనికులను వినియోగిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో భక్తులు స్నానాలు ఆచరించే 100 మీటర్ల పరిధిలో ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించడాన్ని అధికారులు నిషేధించారు. పైగా, ఈ కుంభమేళాకు భారీ స్పందన వచ్చింది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. 
 
మార్చి 4వ తేదీన మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియనున్న నేపథ్యంలో దాదాపు 500 బస్సులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నం చెయ్యబోతోంది. ఆ బస్సుల మీద కుంభమేళా లోగోను కూడా ఏర్పాటు చేసింది. బస్సులన్నీ వరుస క్రమంలో ఒకదాని వెనుక ఒకటి వెళ్లబోతున్నాయి. ఈ బస్సుల వరుస ఏకంగా 3.2 కిలోమీటర్ల దూరం ఉండబోతోంది. ప్రపంచంలో ఇంత పెద్ద బస్సుల వరుస ఇప్పటివరకూ లేదు. అందువల్ల ఇది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments