Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరంలో పేరెంట్స్, ఇంట్లో ఒంటరిగా బాలిక, ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:26 IST)
తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం చెన్నై నగరానికి వచ్చారు. కుమార్తె సొంత ఊరులో బంధువుల ఇంట్లో వుండి 8వ తరగతి చదువుకుంటోంది. ఆమెపై కన్నేశాడు సమీపంలో వున్న ఓ విద్యార్థి. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మాయ మాటలు చెప్పి ఆమెకి దగ్గరయ్యాడు. అత్యాచారం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలికతో ఆమె ఇంటికి కాస్త సమీపంలో వుండే పదో తరగతి విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.
 
బంధువులు ఇంట్లో వున్న ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసాడు. ఆ అవకాశం రాగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆ తర్వాత ఆ ఘటన తాలూకు వీడియోలు తీసి వాటిని చూపించి తమ కోర్కె తీర్చాలంటూ పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఇటీవల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తెలో ఏదో తేడా గమనించి గట్టిగా నిలదీసారు. దీనితో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అఘాయిత్యం చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో విద్యార్థి పరారీలో వున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం