Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరంలో పేరెంట్స్, ఇంట్లో ఒంటరిగా బాలిక, ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థులు గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (18:26 IST)
తల్లిదండ్రులు బ్రతుకుదెరువు కోసం చెన్నై నగరానికి వచ్చారు. కుమార్తె సొంత ఊరులో బంధువుల ఇంట్లో వుండి 8వ తరగతి చదువుకుంటోంది. ఆమెపై కన్నేశాడు సమీపంలో వున్న ఓ విద్యార్థి. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి మాయ మాటలు చెప్పి ఆమెకి దగ్గరయ్యాడు. అత్యాచారం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలికతో ఆమె ఇంటికి కాస్త సమీపంలో వుండే పదో తరగతి విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.
 
బంధువులు ఇంట్లో వున్న ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసాడు. ఆ అవకాశం రాగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను పిలిచి వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆ తర్వాత ఆ ఘటన తాలూకు వీడియోలు తీసి వాటిని చూపించి తమ కోర్కె తీర్చాలంటూ పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఇటీవల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తెలో ఏదో తేడా గమనించి గట్టిగా నిలదీసారు. దీనితో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అఘాయిత్యం చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మూడో విద్యార్థి పరారీలో వున్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం