Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకంటూ ఎవరూ లేరు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం... పుదుచ్చేరి వాసుల సూసైడ్ లేఖ

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (15:24 IST)
కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల్లెలు కూతురు పవిత్ర (12)లు ఉన్నారు. 
 
స్థానిక పోలీసుల వివరాల మేరకు... ఈనెల 24వ తేదీన మంత్రాలయంకు వచ్చిన ఈ ముగ్గురు మఠానికి చెందిన వీవీజీ వసతిగృహంలో 52 నెంబర్‌ గదిని అద్దెకు తీసుకున్నారు. మూడురోజుల నుంచి గదిని తెరవకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని గదిని తెరిచి చూడగా ముగ్గురూ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతులు రాసిన సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 
 
మా కుటుంబంలో అందరూ చనిపోవడంతో మనస్థాపం చెంది తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశారు. తమకంటూ ఎవరూ లేనందున మంత్రాలయంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments