Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకంటూ ఎవరూ లేరు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం... పుదుచ్చేరి వాసుల సూసైడ్ లేఖ

కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (15:24 IST)
కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురిని పుదుచ్చేరి వాసులుగా గుర్తించారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో పాండిచ్చేరికి చెందిన శరణన్‌ (42), అతడి చెల్లెలు శాంతి (28), చెల్లెలు కూతురు పవిత్ర (12)లు ఉన్నారు. 
 
స్థానిక పోలీసుల వివరాల మేరకు... ఈనెల 24వ తేదీన మంత్రాలయంకు వచ్చిన ఈ ముగ్గురు మఠానికి చెందిన వీవీజీ వసతిగృహంలో 52 నెంబర్‌ గదిని అద్దెకు తీసుకున్నారు. మూడురోజుల నుంచి గదిని తెరవకపోవడం, గది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
సీఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని గదిని తెరిచి చూడగా ముగ్గురూ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మృతులు రాసిన సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 
 
మా కుటుంబంలో అందరూ చనిపోవడంతో మనస్థాపం చెంది తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశారు. తమకంటూ ఎవరూ లేనందున మంత్రాలయంలోనే దహన సంస్కారాలు నిర్వహించాలని సూసైడ్‌ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments