Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు ధరించలేదా?... కరోనా కేంద్రాల్లో సేవ చేయించండి : గుజరాత్ హైకోర్టు?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (21:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, ముఖానికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. అయితే, అనేక మంది ముఖానికి మాస్కులు ధరించడం లేదు. దీనిపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రంలో సేవ చేయాలని తెలిపింది. 
 
విశాల్‌ అవతాపి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో నాలుగు నుంచి 5 గంటల పాటు సుమారు ఐదు నుంచి 15 రోజుల వరకు నాన్‌ మెడికల్‌ విధులు నిర్వహించాలని సూచించింది. 
 
క్లీనింగ్‌, హౌ‌స్‌కీపింగ్‌, కుకింగ్‌, హెల్పింగ్‌, సర్వింగ్‌, రికార్డుల తయారీ, రికార్డులను భద్రపర్చడం వంటి పనులను మాస్కులు ధరించవారితో చేయించాలని పేర్కొంది. జరిమానా విధించడంతోపాటు వ్యక్తుల వయసు, విద్యార్హత, జండర్‌, హోదా ప్రకారం ఆయా సేవలు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక విధానాన్ని రూపొందించి ఈ నెల 24న నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments