కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు... ఆరు విగ్రహాలను చోరీ చేశారట

కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (11:51 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు గుర్తించి తెలిపారు. ఈ భవనం మెయిన్‌ రోడ్డులోనే ఉండటంతో, ప్రహరీ ఎక్కి లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీధుల్లో తిరిగేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారని, వాళ్లకు ఇక్కడకు సమీపంలోని సాయి ఆలయం వాళ్లు వారికి దుస్తులు ఇస్తారని, అందుకే ఇక్కడ తిరుగుతూ దొంగతనాలు చేస్తారని చెప్పారు.
 
చోరీకి పాల్పడిన దొంగలు థరూర్ ఇంటి సమీపం నుంచి ఒక ప్రకటన బోర్డుతో పాటు.. ఆరు విగ్రహాలు, ఒక యాంటిక్ పీస్‌తో పాటు రాగి కళ్లజోడును చోరీ చేసినట్టు తెలిపారు. ఇంతకుముందు కూడా విగ్రహాలు చోరీచేసిన ఒక గ్యాంగ్ హస్తాన్ని అనుమానిస్తున్నట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. మెయిన్‌గేటు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయని థరూర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. రోడ్డుమీద ఉన్న ఫుట్‌పాత్ నుంచి ప్రహరీ ఎక్కడం చాలా సులభమన్నారు. ఈ చోరీపై పోలీసులు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments