Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: విమానం నుంచి కిందకు దూకిన పైలట్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (04:36 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టే ఘటన దిల్లీ విమానాశ్రయం వేదికగా జరిగింది. విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారం ప్రయాణికుల్లో వ్యాపించింది.

ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన విమాన కో పైలట్.. కిందకు దూకాడు. పుణె నుంచి దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్రయాణికుడు కరోనా అనుమానితుడని మరో వ్యక్తికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో గందరగోళం తలెత్తింది. విమానంలోని వారు ఆందోళనకు లోనయ్యారు.

అయితే విమానం నుంచి సాధారణ మార్గం ద్వారా కిందకు దిగాల్సి ఉండగా.. కో-పైలట్ కాక్​పిట్ పక్కనుంచే స్లైడింగ్ విండో ద్వారా కిందకు దూకాడు. ఈ ఘటన దిల్లీ విమానాశ్రయంలో చర్చకు దారి తీసింది. అదే సమయంలో అనుమానితుడు ప్రయాణించిన విమానాన్ని రన్​వేపై వేరుగా నిలిపి ఉంచారు.

ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments