Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: విమానం నుంచి కిందకు దూకిన పైలట్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (04:36 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టే ఘటన దిల్లీ విమానాశ్రయం వేదికగా జరిగింది. విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారం ప్రయాణికుల్లో వ్యాపించింది.

ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన విమాన కో పైలట్.. కిందకు దూకాడు. పుణె నుంచి దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్రయాణికుడు కరోనా అనుమానితుడని మరో వ్యక్తికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో గందరగోళం తలెత్తింది. విమానంలోని వారు ఆందోళనకు లోనయ్యారు.

అయితే విమానం నుంచి సాధారణ మార్గం ద్వారా కిందకు దిగాల్సి ఉండగా.. కో-పైలట్ కాక్​పిట్ పక్కనుంచే స్లైడింగ్ విండో ద్వారా కిందకు దూకాడు. ఈ ఘటన దిల్లీ విమానాశ్రయంలో చర్చకు దారి తీసింది. అదే సమయంలో అనుమానితుడు ప్రయాణించిన విమానాన్ని రన్​వేపై వేరుగా నిలిపి ఉంచారు.

ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments