Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: విమానం నుంచి కిందకు దూకిన పైలట్

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (04:36 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టే ఘటన దిల్లీ విమానాశ్రయం వేదికగా జరిగింది. విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారం ప్రయాణికుల్లో వ్యాపించింది.

ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన విమాన కో పైలట్.. కిందకు దూకాడు. పుణె నుంచి దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్రయాణికుడు కరోనా అనుమానితుడని మరో వ్యక్తికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో గందరగోళం తలెత్తింది. విమానంలోని వారు ఆందోళనకు లోనయ్యారు.

అయితే విమానం నుంచి సాధారణ మార్గం ద్వారా కిందకు దిగాల్సి ఉండగా.. కో-పైలట్ కాక్​పిట్ పక్కనుంచే స్లైడింగ్ విండో ద్వారా కిందకు దూకాడు. ఈ ఘటన దిల్లీ విమానాశ్రయంలో చర్చకు దారి తీసింది. అదే సమయంలో అనుమానితుడు ప్రయాణించిన విమానాన్ని రన్​వేపై వేరుగా నిలిపి ఉంచారు.

ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments