Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో దెయ్యం.. హాస్టల్ ఖాళీ చేస్తున్న విద్యార్థులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (19:49 IST)
దెయ్యం భయంతో హాస్టల్‌లో వుంటున్న విద్యార్థులు ఖాళీ చేసి పారిపోతున్నారు. ఈ ఘటన ఏపీలో కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ, కర్నూలు జిల్లాలోని ఓ మోడల్ స్కూల్‌లో దెయ్యముందంటూ విద్యార్థులు జడుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఈ స్కూల్, హాస్టల్ ప్రాంతాల్లో దెయ్యం సంచరిస్తుందని.. విద్యార్థినులు వాపోతున్నారు. 
 
ఈ మోడల్ స్కూల్‌లో చేరే విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో చేరాల్సిందే. ఈ క్రమంలో వంద మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లు రకరకాల శబ్ధాలు వినవస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు. అదీ రాత్రి పూట వినిపించే శబ్ధాలకు విద్యార్థినులు జడుసుకుంటున్నారు. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులతో విద్యార్థులు తెలపడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది విద్యార్థినులు హాస్టల్ ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయిందని.. విద్యార్థినులకు ఎంత నచ్చజెప్పినా దెయ్యం భయంతో విద్యార్థులు ఆ పాఠశాలకు దూరమయ్యారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments