Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారటోరియంపై సామాన్యుని దీపావళి మీ చేతుల్లోనే ఉంది: కేంద్రంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (09:16 IST)
రెండు కోట్ల రూపాయల లోపు బ్యాంకు రుణాలకు వడ్డీపై వడ్డీ మాఫీని జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం రుణాలకు వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేసేందుకు నెల ఆలస్యం ఎందుకంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.
 
తీసుకున్న నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి, చిన్నచిన్న మొత్తాలలో రుణాలు తీసుకున్నవారికి లబ్ధి చేకూరేలా, అన్ని నియమనిబంధనలకు అనుగుణంగా, నిర్ణయాలు తీసుకునేందుకు సమయం కావాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కేంద్రం వాదనలతో ఏకీభవించని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
 
రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులు ఉంటాయని, బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు 
సొలిసినటరీ జనరల్‌ కోర్టుకు సమాధానం ఇవ్వగా కేంద్ర నిర్ణయం అమలుపై సామాన్యుల్లో ఆందోళన నెలకొని వుందని, “సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి జస్టిస్ ఎమ్.ఆర్. షా వ్యాఖ్యానించారు.
 
నవంబరు 15వరకు సమయం ఇవ్వాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరినా, నవంబరు 2ను డెడ్‌లైన్‌గా సుప్రీం ధర్మాసనం చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments