Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్గాంలో టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

Webdunia
గురువారం, 26 మే 2022 (10:04 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల పెట్రేగిపోతున్నారు. ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 60 మందికిపైగా ఉగ్రవాదులు ఉన్నట్టు కాశ్మీర్ ఐజీ విజయకుమార్ వెల్లడించారు. దీంతో ఈ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బుద్గాం జిల్లా చదూరలలో ఓ టీవీ నటిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ నటి అమ్రీన్ భట్ తన మేనల్లుడు ఫర్హాన్‌ జుబైర్ (10)తో కలిసి ఇంటి బయట ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆమె మరణించగా, బాలుడు గాయపడ్డాడు. దీంతో ఆ బాలుడిని జుబైర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఇదిలావుంటే బుధవారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు కలిసి ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments