Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటలోని మామిడి పండ్లు కోశారనీ.. బాలుడిని కాల్చి చంపాడు.. ఎక్కడ?

నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:09 IST)
నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బీహార్‌లోని ఖగారియా జిల్లా పాత్రాహా గ్రామంలో పిల్లలంతా సమీపంలోని మామిడి తోటలో ఆడుకుంటారు. గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన సత్యం కుమార్... తోటలో మామిడి పండ్లు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో తోట కాపలా కాస్తున్న రామాశీష్ యాదవ్ (43) అనే వ్యక్తి పిల్లాడిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో మిగతా పిల్లలంతా ప్రాణభయంతో పరుగుల తీస్తూ గ్రామంలోకి వచ్చి తోటలో జరిగిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్లేలోపే రామాశీష్ పారిపోయాడు. ఈ కిరాతక చర్యపై సత్యం కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments