Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ జిల్లాలో ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (09:39 IST)
జమ్మాకాశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిర్మన్ దేవులపల్లికి చెందిన జవాను చంద్రశేఖర్ (30) కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 
 
ఈ గ్రామానికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన చంద్రశేఖర్‌ కొందుర్గులోని బీసీ సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి వరకు చదివారు. తదనంతరం ఆయన 2011లో సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం లేహ్‌ జిల్లాలో తోటి సైనికులతో కలిసి ప్రయాణిస్తుండగా వాహనం లోయలో పడింది. 
 
ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆయన కుమారుడిని బడిలో చేర్పించేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటూ ఆయన భార్య లాస్య కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పార్థివదేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చని మాజీ సర్పంచి రామకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments