Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు శశికళ స్లో-పాయిజన్ ఇచ్చేసింది.. 2012లో తెహల్కా కథనం.. మన్నార్ గుడి మాఫియా?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న మృతి చెందిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మరణ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (11:45 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న మృతి చెందిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మరణంపై తమిళ ప్రజల్లోనే రాజకీయ నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, జయ మృతిపై తమకు అనుమానాలున్నాయంటూ ప్రముఖ నటి గౌతమి.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు.
 
జయలలిత మరణం తర్వాత ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదో జరిగింది అంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సినీ నటి గౌతమి అయితే తన అనుమానాలను వ్యక్తీకరిస్తూ ప్రధాని మోదీకి ఏకంగా లేఖనే సంధించారు. ఈ నేపథ్యంలో 2012లో ప్రముఖ పత్రిక తెహల్కా శశికళ గురించి సంచలన కథనాన్ని ప్రచురించింది. 2012లో తెహల్కా రాసిన ఈ కథనం... ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చి, సంచలనం రేపుతోంది. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్న శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారని కథనంలో ఆరోపించింది. 
 
అంతేకాకుండా, జయలలితను చంపేందుకు కూడా కుట్ర చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోయస్ గార్డెన్ నుంచి తనను జయ వెళ్లగొట్టిన తర్వాత... తాను నియమించిన నర్సు ద్వారా జయకు శశికళ స్లో పాయిజన్ ఎక్కించారని పేర్కొంది. తాను వాడుతున్న మందులపై జయ చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం వెల్లడైందని తెహల్కా పేర్కొంది. 
 
శశికళను సీఎంను చేయడానికి మన్నార్ గుడి మాఫియా ఎన్నో ప్రయత్నాలను చేసిందని ఆరోపించింది. అక్రమాలకు పాల్పడిన శశికళను, ఆమె బంధువులను పోయస్ గార్డెన్ నుంచి జయ వెళ్లగొట్టిన తర్వాత... జయను మళ్లీ మచ్చిక చేసుకుని, ఆమె వద్దకు చేరిన శశికళ... ఆ తర్వాత పోయస్ గార్డెన్ నుంచే ఆమెపై కుట్రలు సాగించిందని తెహల్కా తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments