Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో పెను విపత్తు : కొండ చరియలు విరిగిపడి...

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:15 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను విపత్తు సంభవించింది. మంచు చరియలు విరిగిపడటంతో ఓ విద్యుత్ కేంద్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 150 మంది కార్మికులు గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 
 
మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. మంచు చరియల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగిపోయింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.
 
ఈ క్రమంలో వరద నీరు చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తగా, ఆ విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అందులోని 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటీన రంగంలోకి దిగాయి. 
 
ఈ వరద కారణంగా ధౌలిగంగా నదీతీరంలో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాగా, సహాయక చర్యల కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఘటనాస్థలికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments