Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి.. బలవంతంగా ఫస్ట్ నైట్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:52 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చికి చెందిన ఓ యువతి చేయకూడని పని చేసింది. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నోడు అయిన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడిని బలవంతం చేసి శోభనం రాత్రిని ఎంజాయ్ చేసింది. అయితే, శారీరకంగా కలిసిన తర్వాత ఆ యువకుడు అనారోగ్యంపాలుకావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొల్లాచ్చికి మాక్కిణం పట్టి నెహ్రూ నగర్‌కు చెందిన రాజశేఖరన్, గురునందని అనే దంపతులకు 17 యేళ్ల బాలుడు ఉన్నాడు. అదే ప్రాంతంలోని నేతాజీ నగర్‌కు చెందిన కృపాకరన్ అనే వ్యక్తికి 19 యేళ్ల యమున అనే కుమార్తె వుంది. ఈమె తన కంటే వయసులో చిన్నవాడైన మైనర్ బాలుడిని ప్రేమించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఆ యువకుడిని కిడ్నాప్ చేసిన ఆ యువతి 27వ తేదీన పళని మురుగన్ ఆలయంలో వివాహం చేసుకుంది. అదే రోజు కోయంబత్తూరుకు చేరుకుంది. సాయంత్రం వరకు ఈషా ఫౌండేషన్‌లో ఉన్నారు. రాత్రికి ఇంటికి చేరుకునే క్రమంలో పెద్ద వర్షం వచ్చింది. దీంతో పొల్లాచ్చిలోని ఓ కిరాణా బంకు పక్కన తలదాచుకున్నారు. 
 
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండటంతో వీరిద్దరూ అక్కడే ఉన్నారు. అదేసమయంలో పెళ్లి చేసుకున్న యువకుడిని బలంవంతం చేసి అక్కడే శారీరకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత యువకుడు అనారోగ్యానికి గురికావడంతో పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించింది. ఇదిలావుంటే, తమ కుమారుడు కనిపించడం లేదంటూ యవకుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితురాలిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments