Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ తీవ్రత.. 24 గంటల్లో కొత్తగా 5,871 కేసులు.. ఏపీలో కోవిడ్ విజృంభణ

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:10 IST)
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,355కు, మరణాల సంఖ్య 5,397కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో 5,146 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,61,459 మంది కోలుకోగా ప్రస్తుతం 53,499 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,996 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. మహమ్మారి బారినపడి 82 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 2,378కి చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో ఏపీలో 55,692 కొవిడ్ టెస్టులు నిర్వహించారు. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 27 లక్షలు దాటింది. కరోనాబారినపడి కోలుకొని డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 1,70,924గా ఉంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments