Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ తీవ్రత.. 24 గంటల్లో కొత్తగా 5,871 కేసులు.. ఏపీలో కోవిడ్ విజృంభణ

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (19:10 IST)
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,355కు, మరణాల సంఖ్య 5,397కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో 5,146 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,61,459 మంది కోలుకోగా ప్రస్తుతం 53,499 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,996 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. మహమ్మారి బారినపడి 82 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 2,378కి చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో ఏపీలో 55,692 కొవిడ్ టెస్టులు నిర్వహించారు. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 27 లక్షలు దాటింది. కరోనాబారినపడి కోలుకొని డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 1,70,924గా ఉంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments