Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిపోదాం రా!... నా ఆత్మహత్యకు దెయ్యమే కారణం.. విద్యార్థిని సూసైడ్ నోట్

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (10:54 IST)
తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. నర్సింగ్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలిస్తే విచిత్రంగా ఉంది. చచ్చిపోదాం రమ్మని దెయ్యం పిలిచిందని ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పైగా, తన ఆత్మహత్యకు గల కారణాలను ఆమె ఓ లేఖలో పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వస్తే, దిండుక్కల్ జిల్లా వేడచందూర్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి కోయంబత్తూరు వైద్య కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. లాక్డౌన్ కారణంగా ఇటీవల ఇంటికి చేరుకున్న యువతి రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంది.
 
ఆ తర్వాతి నుంచి మౌనంగా మారిపోయింది. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం మానేసింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా సూసైడ్ నోట్ కనిపించింది. 
 
అందులో ఆమె రాసిన విషయాలను చదివి విస్తుపోయారు. తన ఆత్మహత్యకు దెయ్యమే కారణమని పేర్కొంది. రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని, చనిపోయేందుకు రావాలంటూ దెయ్యం తనను పిలుస్తోందని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని భయపెడుతోందని ఆ లేఖలో వాపోయింది. ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments