Webdunia - Bharat's app for daily news and videos

Install App

3,500 అడుగుల ఎత్తైన కొండపై గుడి.. ప్రదక్షిణలు చేస్తూ లోయలో పడిన?

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో 3,500 అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఉన్న ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి తలమాలై కొండలపై సంజీవి పెరుమాళ్ ఆలయం వుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలపై నిషేధం అమలులో ఉంది. ఈ

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (12:11 IST)
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో 3,500 అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఉన్న ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి తలమాలై కొండలపై సంజీవి పెరుమాళ్ ఆలయం వుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలపై నిషేధం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో నిబంధనలను మీరి, గుడి చుట్టూ తిరగాలని చూసిన ఓ యువకుడు కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. ఆ దృశ్యాలు వీడియోలో రికార్డైనాయి. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ ప్రదక్షణ కోసం వచ్చి.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు యువకుడి పేరు ఆర్ముగం అని చెప్పారు. ఆర్ముగం ప్రదక్షిణ ప్రారంభించిన వేళ, పక్కన ఉన్న కొందరు అతన్ని వీడియో తీశారని.. అతని కాలు అదుపు తప్పిందని ఆర్ముగం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారు తెలిపారు. వీడియో తీస్తున్నవారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ గుడి చుట్టూ తిరగడానికి అనుమతి లేదని.. రోజూ పదుల సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయానికి, ప్రస్తుతం తమిళ పురట్టాసి మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments