Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య.. చితిపై దూకిన ప్రియుడు....

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (17:21 IST)
తమిళనాడు రాష్ట్రంలోని విలుపురం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యవతి బలవన్మరణానికి పాల్పడింది. తన తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గాఢంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన ప్రియురాలి మరణవార్త తెలుసుకున్న ప్రియుడు తల్లడిల్లిపోయాడు. చివరకు ఆ యువతిని దహనం చేస్తుంటే.. ఉన్నట్టుండి ఆ ప్రియుడు కూడా చితి మంటల్లో దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విలుపురం జిల్లా ఉళుందూరుపేట్టైకు చెందిన నిత్యశ్రీ అనే యువతి డిగ్రీ చదువుతోంది. అయితే, కరోనా వైరస్ కారణంగా కాలేజీ మూతపడివున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. 
 
తన అన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వాలని తండ్రిని అడిగింది. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో స్మార్ట్ ఫోనును కొనివ్వలేక పోయాడు. దీంతో నిత్యశ్రీ మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న ప్రియుడు రాము వెంటనే నిత్యశ్రీ అంత్యక్రియలు జరుగుతున్న శ్మశాన వాటికకు వెళ్లి... అందరూ చూస్తుండగానే ఆమె చితిపై దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments