Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్య ఓటింగ్ జరపాలి... పన్నీర్, స్టాలిన్ వినతి... తిరస్కరించిన స్పీకర్

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ ప

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (11:51 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, విపక్ష నేత ఎంకేస్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే, సభాపతి వి.ధనపాల్ వారి వినతిని నిరాకరించారు. 
 
పైగా, మూజువాణి ఓటుతో బలనిరూపణ చేసుకోవాలని సీఎం పళనిస్వామికి స్పీకర్ అవకాశమిచ్చారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డీఎంకే, పన్నీర్ వర్గం పట్టుబట్టింది. అయితే రహస్య ఓటింగ్‌ను స్పీకర్ తిరస్కరించారు. దీంతో డీఎంకే, పన్నీర్ స్వామి వర్గం ఎమ్మెల్యేల నినాదాలతో హోరెత్తించారు. పోటాపోటీ నినాదాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.
 
అసెంబ్లీలో ప్రస్తుతం 230 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. డీఎంకే అధినేత కరుణానిధి, కోయంబత్తూరు నార్త్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సభకు హాజరుకాలేదు. దీంతో పళనిస్వామి సర్కారు మెజార్టీ సాధించాలంటే 116 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి అయింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments