Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మూత్రం తాగుతామంటున్న తమిళ రైతులు, పట్టించుకోకపోతే 'పెంట' తింటాం...

తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (12:29 IST)
తమిళనాడులో కరవు సాయం అందించాలంటూ గత 38 రోజులుగా తమిళనాడు రైతులు అనేక మార్గాల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత పుర్రెలు, చచ్చిన ఎలుకలు, పాములు పెట్టుకుని నిరసన చేసిన తమిళ రైతులు ఆమధ్య దుస్తులు విప్పేసి నగ్న నిరసన కూడా చేశారు. తాజాగా మరో నిరసనకు తెర తీసారు. కేంద్రం స్పందించనందుకు వారంతా మూత్రం తాగుతామని హెచ్చరిస్తున్నారు. శనివారం నాడు ఈ రకంగా తమ నిరసనను వెల్లడించారు. 
 
ఐనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆదివారం నాడు పెంట తింటామంటూ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆదివారం దాకా డెడ్ లైన్ విధించిన రైతులు తమ డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న ఈ రైతులు ప్రతి ఒక్కరి ముందు మూత్రం నింపిన బాటిళ్లను పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరి మోదీ సర్కారు ఇప్పటికైనా ఏమయినా స్పందిస్తుందో లేదో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments