Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్.. ఆదివారం నో పర్మిషన్

Webdunia
గురువారం, 30 జులై 2020 (14:42 IST)
దేశంలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
 
లాక్‌డౌన్‌ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
అలాగే ప్రతీ ఆదివారం పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించనుండగా.. మిగిలిన రోజుల్లో కొన్నింటిని సడలింపులు ఇవ్వడం జరిగింది. అంతరాష్ట్ర రవాణాపై నిషేధం కొనసాగనుంది. అంతర్‌జిల్లా ప్రయాణానికి ఈ-పాస్‌ తప్పనిసరి చేసింది. 
 
పార్కులు, బీచ్‌లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతుందని తెలిపింది. తమిళనాడులో ప్రస్తుతం 57వేల కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.7లక్షలకు పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా బారినపడి 3,471 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments