Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా కల్లోలం.. కరోనా దెబ్బకు కాంగ్రెస్ అభ్యర్థి మృతి

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (12:09 IST)
తమిళనాడులో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఫలితంగా అనేక మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. వీరిలో అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. అలా కరోనా వైరస్ బారినపడిన శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు కూడా ఉన్నారు. ఈయన చనిపోయారు 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. వెంటనే ఆయనను మదురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. మాధవరావుకు మద్దతుగా ఆయన తనయ ప్రచారం నిర్వహించింది. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరులో 73.03 పోలింగ్‌ శాతం నమోదైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి మాధవరావు కన్నుమూశారు. ఆయన మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఈనెల 6న ఒకే దశలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ స్థానంలో మాధవరావు విజయం సాధించినపక్షంలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments