బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

ఠాగూర్
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:53 IST)
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను వేధిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాని మోడీ ఓ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తూ, తమిళనాడులో పనిచేస్తున్న బీహారీ కార్మికులను డీఎంకే  ప్రభుత్వం అవమానిస్తోందని, వారిపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం స్టాలిన్ 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
 
"ఒక తమిళుడిగా ప్రధాని మోడీని నేను వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని బాధగా ఉంది. ఇలాంటి ప్రకటనలతో తన పదవికి ఉన్న గౌరవాన్ని కోల్పోవద్దు" అని స్టాలిన్ పేర్కొన్నారు. 
 
బీజేపీ సభ్యులు కేవలం ఎన్నికల రాజకీయాల కోసం ఒడిశా, బీహార్ అంటూ తమిళులపై తమ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వం పెంచినట్లే, ఇప్పుడు తమిళులు, బీహార్ ప్రజల మధ్య విరోధం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్టాలిన్ విమర్శించారు. "ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులు మానుకుని, దయచేసి దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి" అని ప్రధానికి, బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments