Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 5,994 మందికి కరోనా లక్షణాలు.. చెన్నైలో 989 కేసులు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (10:09 IST)
తమిళనాడులో ఆదివారం 5,994 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,96,901కి చేరింది. రాజధాని చెన్నైలో 989 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1,09,117కు పెరిగింది. 
 
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న బాధితులలో 119 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,927కు పెరిగింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఆదివారం 6,020 మంది డిశ్చార్జి కావటంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,38,638కు చేరింది.
 
అలాగే దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా కేసులు నమోదవవుతున్నాయి. అయితే కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో 15 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 
భారీ సంఖ్యలో చేపడుతున్న పరీక్షలు, అత్యుత్తమ వైద్య సేవలు తదితర చర్యల ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొంది. దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య.. ప్రస్తుతం ఉన్న యాక్టీవ్‌ కేసుల సంఖ్య కంటే రెట్టింపుగా ఉందని వెల్లడించింది. అలాగే దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల నుంచే ఉన్నాయని పేర్కొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments