Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక విగ్రహం నుంచి నీటి చెమ్మ... క్యూకట్టిన భక్తులు

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (17:58 IST)
వినాయకుడు పాలు తాగిన సంఘటనలు విన్నాం. వేప చెట్టు నుంచి పాలు కారడం చూశాం. ఇపుడు వినాయకుడుకు చెమట పోస్తోంది. గణేష్ మహరాజ్ విగ్రహం నుంచి నీటి చెమ్మ కారుతోంది. దీన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. ఈ వింత దృశ్యం బీహార్ రాష్ట్రంలో కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని గయలోని ఓ ఏరియాలో రాంశిల తకుర్బాదీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడాన్ని ఆలయ పూజారులు గుర్తించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి... స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ వింతను చూసేందుకు స్థానిక భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ముఖ్యంగా, ఈ విగ్రహాన్ని చేతితో తాకితే నీటి చెమ్మ తగులుతోంది. అలాగే, విగ్రహం నుంచి చెమట చుక్కలు వచ్చినట్టుగా నీరు కారుతోంది. 
 
దీనిపై స్థానిక భక్తులు స్పందిస్తూ, దేశంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలేకాకుండా దేవుళ్లు కూడా ఎండలను తట్టుకోలేక పోతున్నారనీ, అందుకే వారి శరీరం నుంచి చెమట వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఈ విగ్రహం చల్లదనం కోసం చందనపు పూత పూశారు. 
 
అయితే, ఈ విగ్రహం నుంచి నీటి చెమ్మ రావడంపై నిపుణులు స్పందిస్తూ, పగడపు రాయితో తయారు చేసిన విగ్రహాలు ఎల్లవేళలా వేడిగా ఉంటాయనీ, వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ఆ విగ్రహాల నుంచి నీటి చెమ్మ రావడం జరుగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments