Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేయి చేయి కలిపితే స్వచ్ఛ్ భారత్ సాధ్యమే : నరేంద్ర మోడీ!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (11:18 IST)
దేశంలోని 125 కోట్ల మంది చేయి చేయి కలిపితే స్వచ్ఛ్ భారత్ సాధ్యమేనని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఢిల్లీలోని వాల్మీకి సదన్‌లో గురువారం స్పచ్ఛ్ భారత్‌ అభియాన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ్ భారత్ కూడా సాధ్యమేనన్నారు. 
 
దేశ శాస్త్రవేత్తల కృషి వల్ల మనం అంగారక గ్రహాన్ని చేరుకున్నాం. అందరూ కలిసి పనిచేస్తే స్వచ్ఛ్ భారత్ కూడా సాధ్యమే. స్వచ్ఛ్ భారత్‌లో అందరూ వారంలో 2 గంటలపాటు పాల్గొనాలి. క్విట్ ఇండియా, క్లీన్ ఇండియా అని మహాత్ముడు సందేశమిచ్చారు. గాంధీ నాయకత్వంలో మనం స్వాతంత్య్రం సాధించుకున్నాం. ఆయన కలలు కన్న స్వచ్ఛ్ భారత్ మాత్రం సాకారం కాలేద్నారు. 
 
ప్రభుత్వం వల్లే స్వచ్ఛ్ భారత్ సాధ్యం కాదు. అందరి మద్దతు అవసరం. పరిశుభ్రపరచడం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదు. ఈ ఆలోచనా విధానం నుంచి మనం బయట పడాలి. సోషల్ మీడియాలో మైక్లీన్ ఇండియా ప్రచారం ప్రారంభించాం. పారిశుద్ధ్యంలో ప్రజలూ భాగస్వాములు కావాలి. భారత్ ఇది సాధిస్తుంది. భారత ప్రజలు ఇది సాధించగలరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments