Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RajasthanCM ఎవరు? నేడు బీజేపీ కీలక సమావేశం

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (09:03 IST)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‍‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, ఈ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం ఆ పార్టీ పెద్దలకు తలకుమించిన భారంగా మారింది. ముఖ్యంగా, రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ ఎంటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతుంది. ఈ సీఎం రేసులో అనేక మంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమెను కాదనలేక కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఎన్నికలకు ముందే వసుంధరాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించి వుండే ఇపుడు ఆమెనే సీఎంగా చేసివుండేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. పోటీలో అనేక మంది నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఓం మాథూర్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా, బాబా బాలక్ నాథ్ వంటి వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జైపూర్ వేదికగా జరిగే కీలక సమావేశంలో రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోనుంది. 
 
మరోవైపు, బీజేపీ అధిష్టానం మాత్రం రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్ని ఎంపిక చేయాలన్న పట్టుదలతో ఉంది. ఆ కొత్త ముఖం ఎవరన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరుగనుంది. ఇందులో కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments