Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (15:07 IST)
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్ బరిలోకి దిగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నా బాన్సురి స్వరాజ్.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజధాని పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. ఈమె బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నాకెంతో సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 400 లోక్ సభ స్థానాలు గెలవాలన్న బీజేపీ లక్ష్య సాధన కోసం నా వంతు కృషి చేస్తాను. నరేంద్ర మోడీని దేశ 'ప్రధాన సేవకుడు'గా మూడోసారి కూడా గెలిపించేందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాటుపడతారు' అని బాన్సురి స్వరాజ్ తెలిపారు.
 
కాగా, 40 ఏళ్ల బాన్సురి స్వరాజ్ ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అంతకుముందు, బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా అందుకున్నారు. గతేడాది ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా నియమితులయ్యారు. బాన్సురి గతంలో హర్యానా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ వ్యవహరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments