Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాంగ కార్యదర్శి మార్పు రచ్చ : నరేంద్ర మోడీ వర్సెస్ సుష్మా స్వరాజ్!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (12:05 IST)
భారత విదేశాంగ కార్యదర్శి మార్పు అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ల మధ్య చిచ్చురేపింది. ఇప్పటి వరకు విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతా సింగ్‌ను బుధవారం రాత్రి తప్పించిన ప్రధానమంత్రి మోడీ.. మరుక్షణమే ఆ పదవిలో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న జైశంకర్‌‍ను నియమించారు. ఈ పోస్టింగ్‌తో జైశంకర్ పదవీకాలం మరో రెండేళ్లు పెరిగింది. పైగా మరో ఎనిమిది నెలల పాటు సర్వీసు ఉన్న సుజాతా సింగ్‌ను తప్పించడానికి గల కారణాలను తెలియరావడం లేదు. 
 
అదేసమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న తనకు తెలియకుండానే విదేశాంగ కార్యదర్శిని ఎలా మారుస్తారంటూ సుష్మా స్వరాజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పాల్గొనాల్సిన రెండు సభలకు సుష్మా డుమ్మా కొట్టారు. 
 
అంతేకాక సుజాతా సింగ్‌ను తప్పించాలని గతంలోనే మోడీ యత్నించగా, సుష్మా అడ్డుకున్నారన్న వార్తలూ తాజాగా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే సుజాతా సింగ్ ఉన్నంత కాలం విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలపై పీఎంఓ నాన్చుడు ధోరణిని అవలంభించిందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments