Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ... సుష్మ స్వరాజ్ వెల్లడి!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (16:01 IST)
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో చైనాలో పర్యటిస్తారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. ఆమె నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో సుష్మతో పాటు విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి జైశంకర్‌ కూడా ఉన్నారు. 
 
ఈ ప్రయటనలో భాగంగా చైనాలో భారతీయులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం సుష్మ విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి చైనా పర్యటన అని తెలిపారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఏర్పాటు చేసే విషయమై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ అదనపు మార్గం ద్వారా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం వీలవుతుందని ఆమె వివరించారు. 
 
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత్‌లో పర్యటించగా, అందుకు ప్రతిగానే నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో ( ఏప్రిల్‌ నెలలో) చైనా పర్యటనకు వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు.
     

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments