సుప్రీంలో రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ : సీబీఐ చేతికి సుశాంత్ కేసు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (16:15 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకు మార్చాలన్ని సుశాంత్ ప్రియురాలు, సినీ నటి రియా చక్రవర్తి అభ్యర్థనను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. అలాగే, తనకు భద్రత కల్పించాలన్న వినతిని కూడా కోర్టు సమ్మతించలేదు. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనీ, ముంబై సినీ మాఫియా చంపేసిందనీ, ఇందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కిరాయి హంతకురాలు అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్ల సుశాంత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. 
 
సుశాంత్ మృతి కేసులో పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలంటూ రియాచక్రవర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. 
 
అలాగే, ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మూడు రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
 
అలాగే, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సంబంధిత పార్టీలను జస్టిస్ హృషికేశ్ రాయ్ సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. రియాకు ప్రొటెక్షన్ కల్పించేందుకు కోర్టు నిరాకరించడంతో బీహార్ పోలీసులు ఏ సమయంలోనైనా రియాను ప్రశ్నించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments