Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో జయలలిత టాప్ : 31.58 శాతం మంది వెల్లడి

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:46 IST)
వచ్చే యేడాది మే నెలలో తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో... వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న అంశంపై ఓ సర్వే జరిగింది. తమిళనాడులో ఇటీవల పీపుల్‌ స్టడీస్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రిగా ఎవరు తగిన అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రస్తుత సీఎం జయలలిత వైపే జనం మొగ్గు చూపారని ఆ సర్వే వెల్లడించింది. 
 
రాష్ట్రంలో 31.58 శాతం ఓటర్లు జయలలిత మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని... ఒకవేళ డీఎంకే గెలిస్తే సీఎం పదవి ఎవరు చేపట్టాలనే ప్రశ్నకు ఎక్కువ మంది కరుణానిధి తనయుడు ఎంకె స్టాలిన్‌ వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ముఖ్యమంత్రి పదవికి స్టాలిన్‌ తగిన అభ్యర్థి అని 27.98 శాతం ఓటర్లు భావిస్తుండగా ఐదు సార్లు సీఎంగా పనిచేసిన కరుణానిధి సీఎం కావాలని 21.33 శాతం ఓటర్లు కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. 
 
అయితే జయలలితకు ప్రధాన ప్రత్యర్థి ఎంకే స్టాలిన్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, ఇతర అభ్యర్థులు బాగా వెనకబడిపోయినట్లు ఆ సర్వే విశ్లేషించింది. ముఖ్యమంత్రి రేసులో డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్‌, పీఎంకే నాయకుడు అన్జుమణి రాందాస్‌లు బాగా వెనుకబడిపోయారు. అన్నాడీఎంకు ప్రజా బలం ఉన్నట్లు కనిపించినా కొన్ని సామాజిక వర్గాలు డీఎంకేకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే, తమిళనాడులో మద్య నిషేధం అమలు కావాలని అత్యధిక శాతం ప్రజలు కోరుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments