Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:38 IST)
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల వాయిదా కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన సంయుక్త రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. జేఈఈ, నీట్ వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 
 
కాగా, ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరాయి. 
 
ఆగస్టు 17న కోర్టు ఇచ్చిన తీర్పులో సమగ్ర న్యాయ పరిశీలన జరగలేదని చెప్పాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పింది. ఈ నెల 1 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా, 13న నీట్ పరీక్ష జరుగనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments