Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:38 IST)
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల వాయిదా కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన సంయుక్త రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. జేఈఈ, నీట్ వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 
 
కాగా, ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరాయి. 
 
ఆగస్టు 17న కోర్టు ఇచ్చిన తీర్పులో సమగ్ర న్యాయ పరిశీలన జరగలేదని చెప్పాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పింది. ఈ నెల 1 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా, 13న నీట్ పరీక్ష జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments