Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో 4జీ సేవలు పునఃప్రారంభం.. సుప్రీం తిరస్కరణ

Webdunia
సోమవారం, 11 మే 2020 (17:10 IST)
పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన, కరోనా రోగులను సరిహద్దులకు పంపించడం.. ఉగ్రమూకల దాడులు వంటి ఘటనలను భారత సైన్యం తిప్పికొడుతున్న తరుణంలో జమ్మూకాశ్మీర్‌లో 4జీ ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించాలన్న విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ, జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. 
 
క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. పిటిషనర్లు పేర్కొన్న అంశాలను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుని సమీక్ష నిర్వహించాలని తెలిపింది.
 
గత నెల 29న జమ్మూకాశ్మీర్ అధికార యత్రాంగం సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపిస్తూ... ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రాథమిక హక్కు కిందకు రాదని తెలిపింది. దేశ రక్షణ కోసం, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించామని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments