Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు విచారణపై స్టే : సుప్రీంకోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:21 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించింది. విచారణ పేరుతో కమిషన్ తమ వైద్యులను వేధిస్తోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. 
 
కాగా, అమ్మ మరణంలో ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాలపరిమితి గతంలో ముగియగా, దాన్ని ప్రభుత్వం పొడగించింది కూడా. 
 
ఈ కమిషన్ విచారణలో భాగంగా, జయలలితకు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ప్రధాన నర్సులు, పలువురు మంత్రులు, శశికళ బంధువులు, ఇలా అనేక మందిని విచారించారు. ఈ కేసు విచారణలోభాగంగా అపోలో ఆస్పత్రి యాజమానికి మరోమారు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే, ఈ విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ మద్రాసు హైకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు... కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... అర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయలలిత మృతిలో ఉన్న మిస్టరీ.. ఓ మిస్టరీగానే మారిపోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments