Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు విచారణపై స్టే : సుప్రీంకోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:21 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించింది. విచారణ పేరుతో కమిషన్ తమ వైద్యులను వేధిస్తోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. 
 
కాగా, అమ్మ మరణంలో ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాలపరిమితి గతంలో ముగియగా, దాన్ని ప్రభుత్వం పొడగించింది కూడా. 
 
ఈ కమిషన్ విచారణలో భాగంగా, జయలలితకు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ప్రధాన నర్సులు, పలువురు మంత్రులు, శశికళ బంధువులు, ఇలా అనేక మందిని విచారించారు. ఈ కేసు విచారణలోభాగంగా అపోలో ఆస్పత్రి యాజమానికి మరోమారు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే, ఈ విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ మద్రాసు హైకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు... కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... అర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయలలిత మృతిలో ఉన్న మిస్టరీ.. ఓ మిస్టరీగానే మారిపోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments