Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మృతి కేసు విచారణపై స్టే : సుప్రీంకోర్టు ఆదేశం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:21 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించింది. విచారణ పేరుతో కమిషన్ తమ వైద్యులను వేధిస్తోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. 
 
కాగా, అమ్మ మరణంలో ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాలపరిమితి గతంలో ముగియగా, దాన్ని ప్రభుత్వం పొడగించింది కూడా. 
 
ఈ కమిషన్ విచారణలో భాగంగా, జయలలితకు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ప్రధాన నర్సులు, పలువురు మంత్రులు, శశికళ బంధువులు, ఇలా అనేక మందిని విచారించారు. ఈ కేసు విచారణలోభాగంగా అపోలో ఆస్పత్రి యాజమానికి మరోమారు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే, ఈ విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ మద్రాసు హైకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు... కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... అర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయలలిత మృతిలో ఉన్న మిస్టరీ.. ఓ మిస్టరీగానే మారిపోనుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments